Wednesday 15 May 2013

టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు: ఎర్రబెల్లి దయాకరరావు


హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. దీనిపై ఈ నెల 17న గవర్నర్‌ను కలుస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకారని, కాని మద్దతుంటుందని తెలిపారు. బయ్యారం ఐరన్‌ ఓర్ విషయంలో ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని విమర్శించారు. బయ్యారం ఉక్కు- స్థానికుల హక్కు అని నినదించారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు, అది తప్పుడు ప్రచారమని ఎర్రబెల్లి కొట్టిపారేశారు.

0 comments:

Post a Comment