Wednesday 15 May 2013

సీరియస్ గానే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం

ఢిల్లీలో ఏదో రాజకీయ హడావుడి నడుస్తున్నట్లే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిన అదిష్టానం పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఢిల్లీకి రావాలని కబురు చేయడం, ఆయన బయల్దేరడం తో రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి, లేదా పిసిసి అద్యక్షుడులలో ఎవరో ఒకరిని మార్చవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువమంది బొత్సనే మార్చవచ్చని అంటున్నారు. అయితే ఇవేవి కావు కళంకిత మంత్రులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయం సీరియస్ గానే ఉందని భావించాలి.

0 comments:

Post a Comment