Monday 13 May 2013

మేం రాం-మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి

తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలవరాదని నిర్ణయించుకున్నారు.వీరంతా అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందున వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే వీరంతా ఇప్పటికే మనోహర్ ను కోరి తమ అబిప్రాయం చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చేలా వెంటనే అనర్హత వేటు వేయాలని కోరినా స్పీకర్ దీనిపై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదు.దీంతో ఇప్పుడు అనర్హత వేటు వేసినా,ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో స్పీకర్ మనోహర్ చేసే విచారణకు స్వయంగా హాజరు కావలసి ఉన్నా, హాజరు కారాదని నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారు ఫాక్స్ ద్వారా తమ అబిప్రాయం చెప్పారు.సుజయరంగారావు, ఆళ్లనాని, రాజేష్,తదితరులు తొమ్మిది మంది అప్పట్లో విప్‌ ఉల్లంఘించారు.వీరంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు.

0 comments:

Post a Comment