Monday 13 May 2013

కడియం శ్రీహరి కు ఎర్రబెల్లి శాపనార్ధాలు

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి టిడిపి నేతలు శాపనార్దాలు పెడుతున్నారు. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆ పార్టీ అదినేత చంద్రశేఖరరావు ప్రాదాన్యత ఇవ్వరని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. కడియం శ్రీహరి తత్వానికి కెసిఆర్ తో పడడం అంత తేలికకాదని వీరు అంటున్నారు. టిడిపి తెలంగాణ పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కడియం కు టిఆర్ఎస్ లో టిక్కెట్ దొరకడం కష్టమేనని అబిప్రాయపడ్డారు.కెసిఆర్ తన చుట్టూ తిప్పుకుంటారు తప్ప టిక్కెట్ ఇవ్వరని, ఆయన వాటిని అమ్ముకుంటారని , కడియం కు భంగపాటు తప్పదని అన్నారు.కెసిఆర్ డబ్బులు దండుకుంటున్నారని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కెసిఆర్ ఉన్నారని ఆయన విమర్శించారు.

0 comments:

Post a Comment