Monday 13 May 2013

ఇది చంద్రబాబు పనే!

ఎన్టీఆర్ విగ్రహా విష్కరణ సాకుతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్‌కు బెయిల్‌ రాకుండా చేశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన ద్వజమెత్తారు. యూపీఏ కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పాలన అందించిన వైఎస్ఆర్ తనయుడిని సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని మారెప్ప అబిప్రాయపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ గేట్లు తెరిస్తే టీడీపీ, కాంగ్రెస్‌లలో ఎవరూ మిగలరని మారెప్ప ఓప్రశ్నకు సమాధానమిచ్చారు.మారెప్ప ను గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గం నుంచి తొలగించారు. ఒక జడ్ పిటిసి ఎన్నికలో మారెప్ప నియోజకవర్గంలో ఓడిపోయినందుకుగాను మరో మంత్రి మాగంటి బాబుతో సహా ఈయనను కూడా పదవి నుంచి తప్పించారు. మాగంటి బాబు ఆవేశంతో పార్టీని వదలి వెళ్లిపోగా, మారెప్ప మాత్రం పార్టీలో కొనసాగి ఇప్పుడు వై.ఎస్.జగన్ కు మద్దతుగా నిలవడం విశేషం.

0 comments:

Post a Comment