Monday 13 May 2013

కుంభకోణాల్లో ప్రధాని పాత్ర తేలాలి: ప్రకాశ్ కారత్

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత అవినీతిమయ పాలనకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారని సీపీఎం దుయ్యబట్టింది. బొగ్గు, 2జీ కుంభకోణాల్లో ప్రధాని.. తన పాత్రతోపాటు ఆయన కార్యాలయ పాత్ర ఏమిటో చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. ‘బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతోపాటు 2జీ స్కాంలో ప్రధాని పాత్ర ఏమిటి? ఈ రెండు వ్యవహారాల్లో పీఎంఓ ఎలాంటి పాత్ర పోషించింది అనే విషయాలను మన్మోహన్ తెలియజేయాలి’’ అని సోమవారమిక్కడ విలేకరులతో అన్నారు. బొగ్గు శాఖను ప్రధానే నేరుగా చూసినందున ఆయన తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు. 

0 comments:

Post a Comment