Sunday 5 May 2013

వై.ఎస్. రాజశేఖరరెడ్డి 6గురు మహిళలను మంత్రుల్ని చేశారు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆరుగురు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా హొం శాఖను కూడా మహిళకే అప్పగించారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటారని విజయమ్మ ప్రకటించారు.రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు భద్రతలేదని ఆమె అన్నారు.. మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.బాపట్లలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహిళ నగారా లో ఆమె ప్రసంగించారు. మహిళలను ఆయన అక్కయ్యా, చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని ఆమె తలచుకున్నారు.ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆడపిల్లలు కూడా ఉన్నత చదువుకున్నారని విజయమ్మ పేర్కొన్నారు.

0 comments:

Post a Comment