Sunday 5 May 2013

గేట్లు తెరిస్తే మిగిలేది బాబు, లోకేషే: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం కాలం చెల్లిన పార్టీగా మిగిలిపోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఆ పార్టీ గేట్లు తెరిస్తే చంద్రబాబు, లోకేష్ మినహా ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాదయాత్ర వృథా ప్రయాసగా మారిందన్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్యే అందుకు నిదర్శనమన్నారు. చిరంజీవి సారథ్యంలో రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారంటూ మంత్రి రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. 

0 comments:

Post a Comment