Sunday 5 May 2013

ఆహ్వానం అందలేదు: ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి

గుంటూరు: పార్లమెంట్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం అందలేదని లక్ష్మీపార్వతి తెలిపారు. దీనికి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ బాధ్యత వహించాలన్నారు. ఎన్టీఆర్ భార్యనైన తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించారు. పురందేశ్వరి ఇష్టం వచ్చిన వారికే ఆహ్వానాలు పంపిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ లకు లేఖ రాస్తానని చెప్పారు. 

0 comments:

Post a Comment