Sunday 5 May 2013

టీడీపీ కాలం చెల్లిన మందు:చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కాలం చెల్లిన మందు లాంటిదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం హైదరాబాద్ లో వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నుంచి వలసలే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.బాబు గేట్లు ఎత్తితే ఆ పార్టీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరూ మిగలరని తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర వృధా ప్రయాసగానే మిగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో చింజీవి ముఖ్యమంత్రి అవుతారన్న దేవాదాయ శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. 

0 comments:

Post a Comment