Tuesday 21 May 2013

యుపిఎకి గడ్డుకాలమే-సర్వే ఫలితాలు

కేంద్రంలో యుపిఎ భవిష్యత్తు కొంత గందరగోళంగానే ఉన్నట్లుంది.పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక టీవీ ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకి కేవలం 136 సీట్లే వచ్చే అవకాశం కనబడుతోంది. అదే బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. సీట్ల సంఖ్య 206 సీట్లకు పెరగవచ్చు.దేశవ్యాప్తంగా నూట ఏభై రెండు సీట్లలో చేసిన సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కు పూర్తి నిరాశగా ఉన్నాయని చెప్పాలి.అయితే బిజెపి కి పూర్తి స్థాయి అదికారం వచ్చే అవకాశం కనడడం లేదు. అంటే టిడిపి,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్,బిజెడి వంటి పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పార్టీలలో ఎక్కువ సీట్లు తెచ్చుకునే పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment