Tuesday 21 May 2013

'ప్రాణహిత'కు జాతీయహోదా: YS విజయమ్మ డిమాండ్


సిర్పూర్-కాగజ్ నగర్(ఆదిలాబాద్ జిల్లా): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జగన్ సీఎం కాగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. 

ఈ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు జరిగిన న్యాయం ఏమీలేదన్నారు. 

అమ్మహస్తం మాయా హస్తంగా మారిందని విమర్శించారు. రాజీవ్ యువకిరణాల వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో ెప్పాలన్నారు. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎక్కడ, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి తరపున కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలనిపిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

0 comments:

Post a Comment