Tuesday 21 May 2013

మిగిలిన మంత్రులకు ఎసరు పెట్టిన బొత్స సత్యనారాయణ


పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయవలసిందేనని ఆయన ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు మంత్రుల తప్పు లేదని చెబుతూ వచ్చిన బొత్స ప్రకటన ఉద్దేశం అదిష్టానం నిర్ణయానుసారం మాట్లాడడమా?లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెట్టడమా?అన్నది చూడాల్సి ఉంది.అంతేకాక పార్టీని వదలి వెళుతున్న ఎమ్.పిలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టుకుని వేలాడుతామా అని కూడా ఆయన అన్నారు.తెలంగాణ అంశం కేంద్రం పరిదిలో ఉందంటూ , ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని బలోపేతం చేయడానికి సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు.పత్రికలు ఎవరి ఎజెండా ప్రకారం రాస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.మంత్రులకు సంబందించి బొత్స చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,కన్నా లక్ష్మీనారాయణ,గీతారెడ్డిలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

0 comments:

Post a Comment