పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ బుధవారం పులివెందులలో పర్యటించనున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లెలో తాగునీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 23న దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు.
0 comments:
Post a Comment