Tuesday 21 May 2013

చంద్రబాబు పై YS విజయమ్మ ధ్వజం


టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. ఎన్.టి.ఆర్.పేరు చెప్పుకునే ఆయన బతుకుతున్నాడని , తెహల్క డాట్ కామ్ రెండువేల సంవత్సరంలోనే చంద్రబాబును అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని , అవినీతిపరుడని పేర్కొందని ఆమె అన్నారు గత మూడేళ్లుగా అన్ని ఎన్నికలలో టిడిపి ఓటమి చెందిందని,అనేకచోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.జగన్ పై కాంగ్రెస్ నేతలు, మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉరి తీయాలని కూడా అంటున్నారని, దేవుడు వీటిని గమనిస్తున్నారని, త్వరలో జగన్ బయటకు వస్తారని, ప్రజల పక్షాన పనిచేస్తారని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు ను జగన్ పూర్తి చేస్తారని ఆమె ప్రకటించారు.
కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

0 comments:

Post a Comment