Tuesday 21 May 2013

నాడు వై.ఎస్.ఆర్., నేడు విజయమ్మ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగు ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేసి పూర్తి కాని ప్రాజెక్టు శిలాఫలకాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటి నిరసన కార్యక్రమాలు చేసి వచ్చారు.ఇప్పుడు ఆయన సతీమణి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నవై.ఎస్.విజయమ్మ కూడా ఇప్పుడు అదే పనిలో పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ వెళ్లిన విజయమ్మ గతంలో వై.ఎస్.శంకుస్థాపన చేసిన ప్రాణహిత ప్రాజెక్టు శిలాఫలకం వద్ద ఒక మొక్క నాటారు.అలాగే బోటులో ప్రాణహిత నదిలో కొంతదూరం వెళ్లి ప్రాజెక్టు ప్రదేశాన్ని చూసి వచ్చారు.మిగిలిన ప్రాజెక్టు స్థలాలను కూడా ఆమె సందర్శిచబోతున్నారు.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న విజయమ్మ రచ్చబండ, ప్రాజెక్టుల సందర్శన వంటి ఆందోళనలను నిర్వహిస్తున్నారు.

0 comments:

Post a Comment