Friday 10 May 2013

కొండా దంపతులకు బీజేపీ గాలం !


తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీని

బలపరుచుకునే ప్రయత్నాలలో బీజేపీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తోంది. జగన్ పార్టీకి అండదండగా ఉన్న కొండా సురేఖ దంపతులను బీజేపీలోకి తెచ్చేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేరుగా కొండా దంపతులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో పార్టీ పగ్గాలన్నీ తమ చేతుల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇటీవల అధిష్టానం నిర్ణయాలకు నిరసనగా పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన కొండా అనుచరులు నలుగురిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో కొండా దంపతులు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలోకి రానున్న నేపథ్యంలో కొండా దంపతులను కూడా పార్టీలోకి లాగితే బీజేపీకి ఊపు వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక గత ఉప ఎన్నికల్లో కొండా సురేఖ గెలవాలని కిషన్ రెడ్డి పరోక్షంగా సాయం చేశారు. పది స్థానాలలో పోటీ చేస్తున్నా ఒక్క పరకాల సీటుమీదనే దృష్టి పెట్టి టీఆర్ఎస్, తెలంగాణ ఓట్లు చీల్చి సురేఖ గెలిచేలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. 

1 comment:

  1. YSRCP should give full powers in Warangal dist and support them.

    N.siva Reddy
    8718887727
    KADAPA

    ReplyDelete