Friday 10 May 2013

మెగాస్టార్ చిరంజీవి ఇంటి స్థలం పైల్ స్వాధీనం

గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి , మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కిరణ్ శిబిరానికి ఆగ్రహం తెప్పించాయా?తమ సత్తా ఏమిటో చూపించాలని అనుకున్నారా?ఆకస్మికంగా చిరంజీవికి సంబంధించిన ఇంటి స్థలం పైలును, బ్లడ్ బ్లాంక్ స్థలం ఫైలును సిఐడి అదికారులు స్వాదీనం చేసుకున్న వైనం రాజకీయ వర్గాలలో చర్చనీయంగా మారింది.ఒకపక్క చిరంజీవి కి అదిష్టానం వద్ద పరపతి పెరుగుతున్నది తెలిసి కూడా సి.ఎమ్.క్యాంప్ ఈ సాహసం చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. గతంలో తన ఇంటి పక్కన ఉన్న 900 గజాల స్థలాన్ని కూడా చిరంజీవి కలుపుకున్నారని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంపై అది కేసుగా మారడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో దానిని ఆయన క్లియర్ చేసుకున్నారని అంటారు. కాగా బ్లడ్ బ్యాంక్ స్థలం పక్కన ఉన్న రెండువందల గజాల స్థలం కూడా ఆక్రమించారన్నది మరో అభియోగం. చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఈ వ్యవహారాలపై సిఐడి దృష్టి సారించడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవిలకు మద్య అంతరం బాగా పెంచవచ్చన్న అబిప్రాయం కలుగుతుంది.

0 comments:

Post a Comment