Friday 10 May 2013

కుట్ర వల్లే YS జగన్ కు బెయిల్ రాలేదు: బాలినేని

ఒంగోలు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ కుట్ర వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత వైఖరి మరోసారి రుజువైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పటికీ కాంగ్రెస్ కు లొంగడని... ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండలని బాలినేని సూచించారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన తెలిపారు.

మంత్రుల విషయంలో ఓ విధంగా... జగన్ విషయంలో మరోలా సీబీఐ వ్యవహరించిందని బాలినేని అన్నారు. 2జీ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా సీబీఐ కాంగ్రెస్ డైరెక్షన్ లో నడుచుకుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏదో రాజకీయం నడిపారని ప్రజలు అనుకుంటున్నారని బాలినేని అన్నారు. 

0 comments:

Post a Comment