Friday 10 May 2013

టీడీపీ విశ్వసనీయత కోల్పోయింది: కడియం శ్రీహరి


వరంగల్ : అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవటంతో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని కడియం శ్రీహరి అన్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.

టీడీపీ-కాంగ్రెస్ కలిసిపోయాయనే సంకేతాలు ప్రజలకు వెళ్లాయన్నారు. తనకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కడియం శ్రీహరి తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలో ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. 

0 comments:

Post a Comment