Monday 20 May 2013

బలి పశువు అయ్యాను: ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్ : మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఉదయం ధర్మానను కలిశారు. తాను బలిపశువునయినట్లు ధర్మాన ఈ సందర్బంగా వారి వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా ఈరోజు సాయంత్రం 6.30గంటలకు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వెళ్లనున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ధర్మాన భవిష్యత్‌ కార్యాచరణను తేల్చుకోనున్నట్టు సమాచారం. అయితే ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

0 comments:

Post a Comment