Monday 20 May 2013

గోతిలో కాంగ్రెస్ నేతలే పడ్డారు


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ తీసిన గోతిలో కాంగ్రెస్ వారే పడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఎక్కువకాలం జైలులో ఉంచే కుట్రతోనే ఇప్పుడు దర్మాన, సబితలతో రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు.జగన్‌పై కుట్రలు బయటపెడితే జైలుకు పంపుతామని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని రాంబాబు తెలిపారు. ధర్మాన, మరో మంత్రి పార్థసారధికి కోర్టు జైలు శిక్ష విధించినా .. ఇంకా మంత్రి పదవిలో ఉండటం దారుణమని అంబటి వ్యాఖ్యానించారు. 
. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల కూటమి పాలన కొనసాగుతోందని అంబటి విమర్శించారు. గవర్నర్, రాష్ట్రపతిలను చంద్రబాబు కలవడం కాంగ్రెస్‌ గేమ్ ప్లాన్‌లో భాగమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని అంబటి అంటున్నారు.

0 comments:

Post a Comment