Monday 20 May 2013

నేడు ‘ప్రాణహిత’కు YSవిజయమ్మ


- ప్రాణహిత-చేవెళ్ల సత్వర సాధన కార్యాచరణలో భాగంగా పర్యటన
- ప్రాజెక్టు శిలాఫలకానికి పాలాభిషేకం
- అనంతరం కాగజ్‌నగర్‌లో బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేసిన ప్రదేశాన్ని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం సందర్శించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు సత్వర సాధన కార్యాచరణలో భాగంగా ఆమె అక్కడకు వెళుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా 2008 మే 26న అదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లో గల తుమ్మిడిెహ ట్టి గ్రామం వద్ద ప్రాణహిత నది ప్రారంభమయ్యే చోటును సందర్శించి అక్కడ పుష్కలంగా ఉన్న నీటిని తెలంగాణలో వినియోగంలోకి తేవాలని అభిలషించారు.

ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 17న మళ్లీ అక్కడకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ సంకల్పించిన ఈ ప్రాజెక్టు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుంది. ఇంతటి బృహత్తరమైన ప్రాజెక్టు వైఎస్ మరణించిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పోల వరంతో పాటుగా ఈ ప్రాజెక్టును కూడా జాతీ య ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటింపజేయాలని వైఎస్ భావించారు. ఆయన మరణానంతరం నేతల అలసత్వం, అశ్రద్ధ కారణంగా ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా లభించడం లో జాప్యం జరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రజల జీవగర్ర కాగల ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని విజయమ్మ డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం వేసిన చోటును సందర్శించనున్నారు.

0 comments:

Post a Comment