Monday 20 May 2013

కిరణ్‌, బొత్స మాట మార్చారు: తలసాని


హైదరాబాద్ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మంత్రులను సమర్థిస్తూ సీబీఐని తప్పుబట్టిన ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇప్పుడు మార్చారని ఆయన ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవినీతికి గేట్లు తెరిచారని తలసాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపైనే ఎర్రచందనం తరలింపు ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

0 comments:

Post a Comment