Thursday 16 May 2013

సోషల్ నెట్ వర్క్ - వ్యాఖ్యలపై తీర్పు

ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిని ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల అనుమతితో మాత్రమే అరెస్ట్‌ చేయాలని సుప్రింకోర్టు అబిప్రాయపడింది. అభిప్రాయాలపై ముందే అరెస్ట్ లు వద్దని, విచారణ అనంతరమే వారిని అరెస్ట్ చేయాలని సూచించింది.అది కూడా ఉన్నత స్థాయి అదికారుల పర్యవేక్షణలోనే జరగాలని సుప్రింకోర్టు చెప్పడం విశేషం. మన రాష్ట్రానికి చెందిన జయ వింద్యాల కేసులో సుప్రింకోర్టు ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది.ఏది ఏమైనా సోషల్ నెట్ వర్క్ లలో అభ్యంతరకర, అసబ్యకర భాష వాడకుండా, దేశద్రోహ, ఉగ్గరవాద, తీవ్రవాద అనుకూల వ్యాఖ్యలు చేయకుండా ఉంటే దేశానికిర సమాజానికి మంచిదని చెప్పక తప్పదు.పౌరహక్కుల విషయంలో స్వేచ్చ కలిగిన భారత్ లో ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా ఉండడం అవసరం.అలాగే ఎవరు పడితే వారు అరెస్టు చేయకుండా ఉండాలన్న సుప్రిం తీర్పు కూడా స్వాగతించదగిందే.

0 comments:

Post a Comment