Thursday 16 May 2013

కాన్వాయ్ లేకుండా బయటకు వెళ్లిన సీఎం కిరణ్

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం ఏపీ భవన్ నుంచి కాన్వాయ్ లేకుండా బయటకు వెళ్లారు. ఏఐసీసీ ఉపాధ్యక్షురాడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకే ముఖ్యమంత్రి వెళ్లినట్లు సమాచారం. గత రెండు రోజులుగా హస్తినలో మకాం వేసిన కిరణ్ కుమార్ రెడ్డి పలువురు నేతలతో సమావేశం అయ్యారు. ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు.

0 comments:

Post a Comment