Thursday 16 May 2013

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల


హైదరాబాద్ : పదవ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి పరీక్షా ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈసారి కూడా గతేడాది తరహాలోనే మార్కులు వెల్లడించకుండా కేవలం గ్రేడ్లను మాత్రమే ప్రకటించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే అధికశాతం ఉత్తీర్ణత సాధించారు. 88.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 0.24 ఉత్తీర్ణత శాతం పెరిగింది. 

విద్యార్థులు ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల నుంచి తమ గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ల సగటు (జీపీఏ) పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్, మొబైల్ ద్వారా (ఐవీఆర్‌ఎస్) 1255225 నంబరుకు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ఎస్‌ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ టైప్ చేసి 53345, 53346 నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. 5888 నం బరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. www.saksh.com, www.sakshieducation.com వెబ్‌సైట్‌తోపాటు వివిధ ప్రైవేటు సైట్లలో ఫలితాలను చూడవచ్చు.

0 comments:

Post a Comment