Thursday 16 May 2013

కాంగ్రెస్, టీడీపీ వెన్నుపోటు పార్టీలు: వైఎస్ షర్మిల


రావికంపాడు: వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆయన గుండెల్లోంచి పుట్టినదేనని పశ్చిమ గోదావరి జిల్లా రావికంపాడు సభలో షర్మిల అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్త చేసుకున్నారు. కిరణ్‌, చంద్రబాబుల 'పథకాల'పై షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీలు రెండూ వెన్నుపోటు పార్టీలేనని షర్మిల అన్నారు. 

ఎన్ టీఆర్ ను టీడీపీ వెన్నుపోటు పొడిస్తే.. వైఎస్ఆర్ చనిపోయాక కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని షర్మిల తెలిపారు. ఐఎంజీపై సీబీఐ నిజాయితీగా దర్యాప్తు చేసుంటే బాబు ఎప్పుడో జైల్లో ఉండేవారని షర్మిల అన్నారు. జగనన్న దోషి అని ఏ కోర్టు చెప్పలేదని, ఐఎంజీ, ఎమ్మార్‌ కేసుల్లో బాబు నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదని షర్మిల తెలిపారు. 

0 comments:

Post a Comment