Thursday 16 May 2013

మంత్రి సి. రామచంద్రయ్య లక్ష్యం ఇదేనా!


మంత్రి సి.రామచంద్రయ్య తన ఎజెండా ప్రకారమే కధ నడుపుతున్నట్లున్నారు.చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం లక్ష్యాలుగా పెట్టుకుని కాపు సంఘాలన్ని పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కాపు సంఘాల సమావేశంలో ఆయన పా్లొన్నారు. రామచంద్రయ్య రెండు లక్ష్యాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు కాపులను నిలబెట్టడం, చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ఐక్యత అవసరం అని తెలియచెప్పడం వంటి ఉద్దేశాలతో రామచంద్రయ్య మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఏ రాజకీయ పార్టీతో సంబందం లేదని కాపునాడు అద్యక్షుడు మిరియాల వెంకటరావు చెప్పినా , రామచంద్రయ్య మాత్రం తన పద్దతితో కుల సంఘాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.అయితే ఆయనే చెప్పినట్లు మిగిలిన కులాలను వెంటబెట్టుకోగలిగితేనే వారి రాజకీయ ప్రాదాన్యం పెరుగుతుంది.కాకపోతే కాంగ్రెస్ లో తమ బలం పెంచుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడవచ్చు.

0 comments:

Post a Comment