Thursday 16 May 2013

హరికృష్ణతో రాజీ యత్నాలు జరుగుతున్నాయా!

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు, రాజ్య సభ సభ్యుడు హరికృష్ణల మద్య ఏర్పడిన అంతరం తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కదనాలు వస్తున్నాయి.ఎన్.టి.ఆర్.కుమారుడు, తన వియ్యంకుడు బాలకృష్ణ ప్రత్యేకంగా చంద్రబాబు తో భేటీ అవడంపై కధనాలు వస్తున్నాయి. హరికృష్ణకు ఇటీవలికాలంలో ప్రాధాన్యత తగ్గించారని, చివరికి గవర్నర్ వద్దకు వెళ్లే కార్యక్రమానికి కూడా హరికృష్ణను పిలవలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపద్యంలో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు ఆరంబించారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాలు ఈ బేటీకి ప్రాధాన్యత లేదని చెబుతున్నా, ఎవరికి తగ్గ ఊహాగానం వారు చేస్తుననారు.ఫ్లెక్సీల వివాదం నుంచి హరికృష్ణ అసంతృప్తిగా ఉంటున్న విషయం బహిరంగ రహస్యమే. వచ్చే మహానాడులో హరికృష్ణ హాజరు కాకపోతే, అదో అంశంగా మీడియాలో వచ్చే అవకాశం ఉంది.దానిని కూడా గమనంలోకి తీసుకుని బాలకృష్ణ ద్వారా రాయబారం జరుపుతున్నారా అంటూ ఒక ప్రచారం ఉంది.ఏది ఏమైనా అంతర్గత వివాదాలు తగ్గించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం మంచిదే.

0 comments:

Post a Comment