Thursday 16 May 2013

వై.ఎస్.కుటుంబంపై రాళ్లు వేస్తున్నారు


దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇమేజీతో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు వెన్నుపోటు పొడిచిందని, ఆయన కుటుంబంపై రాళ్లు వేస్తోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడులో రెండువేల కి.మీ.పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. తాను జగన్ వదలిన బాణాన్నే అని ఆమె ప్రకటించారు.వచ్చే ఎన్నికలలో ఈ కుట్రదారులను నరకాసురులను ఓటు ద్వారా సంహరించాలని, అప్పటివరకు యుద్దమేనని ఆమె ప్రకటించారు.పార్టీ ముఖ్యనేతలంతా వెళ్లి సంఘీ భావం ప్రకటించిన ఈ షర్మిల ఉత్సాహంగా మాట్లాడారు.

0 comments:

Post a Comment