Saturday 18 May 2013

తిరుగుబాటు ఎమ్మెల్యేల విచారణ 28కి వాయిదా


హైదరాబాద్: టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఎమ్మెల్యేలను విచారించారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి, ఆదిలాబాడ్‌ జిల్లాకు చెందిన ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి తమ న్యాయవాదులతో కలిసి వచ్చి తమ వాదనలు వినిపించారు. తెలుగుదేశం పార్టీ తరపున విప్ ధూళిపాళ్ల నరేంద్ర హాజరై తమ వాదనలు వినిపించారు.

విచారణ అనంతరం వేణుగోపాల చారి మాట్లాడుతూ విప్ ఇచ్చామని టీడీపీ వాదిస్తోందని, తమకు ఎలాంటి విప్ అందలేదని చెప్పారు. అందువల్ల అనర్హత పిటిషన్ చెల్లదన్నారు. తమ వాదనలను వినడానికి కేసును ఈ నెల 28కి వాయిదా వేశారని 
చెప్పారు.

0 comments:

Post a Comment