Saturday 18 May 2013

మంత్రులు ధర్మాన,సబితలపై కీలక నిర్ణయం !

జగన్ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులపై వేటు వేయాలా?వద్దా అన్నదానిపై భిన్న కదనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆ మంత్రులను ఇప్పుడున్న పరిస్థితులలో తొలగించరాదని తన వాదన అధిష్టానం వద్ద వినిపించారు. అయితే అదిష్టానం మాత్రం వారిని తొలగించాల్సిందేనని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.ప్రత్యేకించి సిబిఐ చార్జీషీట్ లో ఉన్న మంత్రులనైనా తొలగించాలని అదిష్టానం అబిప్రాయంపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఎప్పుడు వారిని తొలగించాలన్నదానిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్ కే వదలివేసినట్లు చెబుతున్నారు.శనివారం నాడు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ తో ముఖ్యమంత్రి కిరణ్ బేటీ అయి ఆయా విషయాలు చర్చించారు.ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యారు. ఆయన ఇక్కడకు వచ్చాక ఎలాంటి సమాచారం వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.అయితే మీడియాలో మాత్రం రెండు రకాల కధనాలు వస్తున్నాయి. మంత్రులు దర్మాన,సబితా ఇంద్రారెడ్డిలకు ఉద్వాసన తప్పదని కొందరు చెబుతుంటే, మరికొందరు వెంటనే జరగకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది.

0 comments:

Post a Comment