Saturday 18 May 2013

మంత్రి దర్మాన ప్రసాదరావుకు కిరణ్ ఫోన్

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దర్మాన ప్రసాదరావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని కోరడంతో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం వెలువడుతుందా అన్న చర్చ జరుగుతోంది.మంత్రి దర్మాన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా దర్మానకు ఫోన్ చేశారని సమాచారం.ఎఐసిసి అధికార ప్రతినిది చాకో జగన్ కేసులో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని బహిరంగంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రికి సైతం ఇరకాట పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే మంత్రులు ధర్మాన,సబితలు రాజీనామా చేయగా వాటిని సి.ఎమ్. తోసిపుచ్చారు. ఈ దశలో మళ్లీ రాజీనామా కోరాల్సి రావడం ఆయనకు ఇబ్బందిగా మారుతుంది.అయినప్పట్టికీ ధర్మానతో ,అలాగే సబితతో కిరణ్ ఏమి చెబుతారో చూడాలి.కాగా ఒక వేళ మంత్రి పదవిని వదలుకోవలసి వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ధర్మాన అనుచరులు డిమాండ్ చేస్తూ పార్టీని హెచ్చరిస్తున్నారు.

0 comments:

Post a Comment