Saturday 18 May 2013

దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి: ఈటెల రాజేందర్


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంపై మరోసారి కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుట్రలో భాగంగానే రఘునందన్ టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనివెనకుండి నడిస్తున్నారని ఈటెల ఆరోపించారు.

దమ్ముంటే రఘునందర్ ఆరోపణలు రుజువు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ఆంధ్రా సంపన్నుల గొంతై రఘునందర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పద్మాలయ స్టూడియోపై టీఆర్ఎస్ న్యాయపోరాటం చేసిందని ఈటెల తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. కాగా విజయశాంతి ఎందుకు స్పందించలేదన్న విషయంపై ఈటెల మాట దాటవేశారు.

0 comments:

Post a Comment