Saturday 18 May 2013

కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామా

- కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాకు తెరలేపారు
- ఆరోపణలున్న మంత్రుల వ్యవహారంలో ఏడాదిగా మౌనం పాటించారు
- ఢిల్లీ వెళ్లివచ్చాకే అకస్మాత్తుగా గొంతు విప్పడం అనుమానాలకు తావిస్తోంది 
- లోకకల్యాణం కోసం పాటుపడుతున్నానని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
- చీకటి ఒప్పందాలతో.. కాంగ్రెస్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నారు 


హైదరాబాద్: వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో బాబు రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేసిన తరువాతే.. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్నారని ఆయన చెప్పారు. మంత్రి ధర్మానపై చార్జిషీట్ వేసి ఏడాది కావొస్తున్నదని, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిరాగానే అకస్మాత్తుగా గవర్నర్, రాష్ట్రపతిని కలవాలనే ఆలోచన తట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్‌రెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నా, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నా, ప్రజలపై పెనుభారం మోపుతున్నా ఏనాడూ స్పందించని చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలే ఎజెండాగా ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు. 

రాజకీయంగా వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసే కుట్రలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలుకుని కేంద్రంలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరుతోపాటు ఇటీవలి కాలంలో రాష్ట అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌ను రక్షించేందుకు చంద్రబాబు చేసుకున్న కుమ్మక్కులను ఆయన ఒక్కొక్కటిగా వివరించారు.

ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే జరుగుతున్నదని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో బాబు నడిపిస్తున్న ఈ చీకటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఆధారాలతోసహా తాము నిరూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి లోక కల్యాణంకోసం పాటుపడుతున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార దాహంతో సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి మరణానికి కారకుడైన వ్యక్తి నీతులు వల్లించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో? పార్టీ కార్యాలయం ఏవిధంగా నిర్మించారో? కొడుకు లోకేష్ చదువులు అమెరికాలో ఎలా కొనసాగాయో ప్రజలకు వివరించగలరా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు.

మీకు పార్లమెంటు, మాకు అసెంబ్లీ!
కేంద్ర మంత్రి చిదంబరంను చీకట్లో కలిసి తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా చూసుకున్న చంద్రబాబు... కాంగ్రెస్‌కు అవసరం వచ్చిన ప్పుడల్లా ఆపన్నహస్తం అందిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజాసమస్యలు విస్మరించి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు నిత్యం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా బాబుకు పట్టదన్నారు. చీకట్లో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్.. పార్లమెంటు, టీడీపీ అసెంబ్లీ స్థానాలకు ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారని పేర్కొ న్నారు. తమను ఎన్ని కష్టనష్టాలకు గురిచేసినా వైఎస్ కుటుంబం ప్రజలకోసం మొక్కవోని ధైర్యంతో ముం దుకు సాగుతోందన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపట్లేదని, అదంతా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. వైఎస్ ఇమేజ్‌ను దెబ్బతీసేం దుకు, జగన్‌ను అణచివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐతో నాటకమాడిస్తున్నాయన్నారు.

0 comments:

Post a Comment