Saturday 18 May 2013

బీజేపీలోకి కేసీఆర్ అన్నకూతురు ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్న కూతురు రమా మధుసూదనరావు బీజేపీలో చేరేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. రమ కొన్ని రోజులుగా బీజేపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జూన్ 3న హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్‌లో జరిగే పార్టీ సభలో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే ఆమె చేరే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నా యి. అదేవిధంగా...హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఆలె జితేంద్ర జూన్ 3వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఇతడు కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర రెండో కుమారుడు.

0 comments:

Post a Comment