Tuesday 28 May 2013

ఎవరి వల్ల ఎవరు ఓడిపోయారో!

రెండువేల నాలుగులో బిజెపి వల్ల నష్టపోయామని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడుపై బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నడైనా ఆయన సొంతంగా గెలిచారా అని ప్రశ్నించారు.1999లో తమ పొత్తు వల్ల గెలిచిన టిడిపి, ఇప్పుడు బిజెపి వల్ల ఓడామని చెప్పడం విడ్డూరం అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.2004లో టిడిపి వల్లనే తాము నష్టపోయామని కిషన్ వ్యాఖ్యానించారు.తమతో పొత్తుపెట్టుకున్నప్పుడు మత తత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.ఇక్కడ విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణ టిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు తాము బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సంకేతం ఇస్తే చంద్రబాబు మాత్రం అలాంటి పొత్తు ఉండదని చెబుతున్నారు.నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదో ఒక ముఖ్యమైన పార్టీలో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఉందని, అది బిజెపి అయితే బెటర్ అని పార్టీలో కొందరి భావన.కాని అంతకుముందు ఆ పార్టీపై చేసిన విమర్శలతో ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి టిడిపి ఇబ్బంది పడుతోంది.ఇంతకీ ఎవరి వల్ల ఎవరు ఓడారంటారు?

0 comments:

Post a Comment