Tuesday 28 May 2013

మహానాడుకు దూరంగా హరికృష్ణ, జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరయ్యారు. మహానాడు తొలిరోజైన సోమవారం హాజరైన హరికృష్ణ రెండో రోజు ఆ దరిదాపుల్లోకి రాలేదు. మహానాడులో రెండో రోజున పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే మంగళవారం మహానాడులో జరిగిన ఎన్టీఆర్ జయంతికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం వరకూ ఉండి వెళ్లిపోయారు.

కాగా, మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు జూనియర్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులోని తాత సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు ‘మీరు మహానాడుకు హాజరవుతున్నారా?’ అని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదు కాబట్టి వెళ్లటం లేదని.. ఒకవేళ ఇపుడు పిలిచినా వెళతానని ఆయన బదులిచ్చారు. అయితే ఆయన్ను పార్టీ వర్గాలు ఆహ్వానించకపోవటంతో మహానాడు ముగిసే వరకూ రాలేదు. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందక పోవటంపై మహానాడు ఆహ్వా న కమిటీ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు. ఇదే విషయమై టీడీపీ కార్యాలయవర్గాలు మాత్రం.. వారికి ఆహ్వనం పంపామని కొద్ది సేపు.. పార్టీ నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపుతామని, కుటుంబసభ్యులను ఎపు డూ ఆహ్వానించేది లేదని మరికొద్ది సేపు చెప్పారు.

0 comments:

Post a Comment