Tuesday 28 May 2013

ఒక నేత అరెస్టు అయితే ముగ్గురు కొత్త నేతలు!

రాష్ట్ర రాజకీయాలు తమాషాగా మారుతున్నాయి.జగన్ ను జైలులో నిర్బందించి ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అందులో వై.ఎస్.కుటుంబీకులు విజయమ్మ, షర్మిల,భారతిలు పాల్గొనడం ఆసక్తికరంగా ఉంది.ఈ సందర్భంగా విజయమ్మ సిబిఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. హైకోర్టు జగన్ ఆస్తులపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని అడిగితే ఇరవైఎనిమిది బృందాలను ఆగమేఘాల మీద దింపి రెండు వారాలలో నివేదిక ఇచ్చిన సిబిఐ, ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా, దర్యాప్తునకు ఇంకా సమయం కావాలని అంటున్ నదని, ఇదంతా జగన్ ను జైలులో ఎక్కువ కాలం నిర్భందించాలన్న కుట్ర ప్రకారమే ఇది జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయానికి సిబిఐ సమాధానం చెప్పగలుగుతుందా అన్నది ప్రశ్న.సిబిఐ సుదీర్ఘకాలం తీసుకోవడం ద్వారా జగన్ రాజకీయ ప్రత్యర్ధులకు ఆ సంస్థ ఉపయోగపడుతున్నదన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తున్నది.ఇది ఒక కోణం అయితే విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కార్యక్రమాలకు వెళుతుంటే, షర్మిల సుదీర్ఘ పాదయమాత్ర చేపట్టి ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇక జగన్ కు మద్దతుగా జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా భారతి కూడా మున్నుందు అవసరమైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న అభిప్రాయం కలుగుతుంది. మొత్తం మీద ఒక నేతను అరెస్టు చేస్తే, ముగ్గురు నేతలు తయారు అవుతున్నారన్నమాట.

0 comments:

Post a Comment