Wednesday, 8 May 2013

విజయ సాయిరెడ్డి బెయిల్

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ న్యాయస్థానం నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

కాసేపట్లో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావటంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా ఈరోజే తీర్పు వెలువడనుంది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ వర్గీయులపై వేటు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ దంపతులకు అనుయాయులుగా ఉన్న నలుగురు జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీం.రాధ, మసూద్, మోమన్ రావు తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నట్లుగా అనుకోవాలి.

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్

ఖమ్మం : జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన గురువారమిక్కడ తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని అజయ్ కుమార్ తెలిపారు.

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తారు. జగన్‌తో పాటుగా ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్, విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్లపైనా తీర్పు రానుంది. మూడు తీర్పులనూ వేర్వేరుగా ఇవ్వనున్నారు.

YS జగన్ బెయిల్ కోసం సర్వమత ప్రార్ధనలు

మహేశ్వరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత దీపాభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్వమత ప్రార్థన కార్యక్రమంలో భారీ ఎత్తున్న అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

సీఎం కిరణ్ కు మరో షాక్!

వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో సీఎం కిరణ్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. వరంగల్ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ తీర్పు ప్రకారమే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

వైఎస్ హయాంలో రైతు రాజుగా మారాడు: YS షర్మిల


ఖమ్మం: ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ.. వ్యవసాయం దండగ అన్న ఘనత చంద్రబాబుదేనని షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్టులు కడితే నష్టం అని బాబు వ్యవసాయాన్ని నీరుగార్చారని షర్మిల ఆరోపించారు. చందుగొండ మండలం ఎర్రగుంటలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో రైతులను పురుగుల్లా చూశారు అని అన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాకే రైతు రాజుగా మారాడని షర్మిల తెలిపారు. 
ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైఎస్ఆర్ గిరిజనులకు 2లక్షల ఎకరాల అటవీభూములపై హక్కు కల్పించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహానేత వైఎస్ బతికుంటే ఈ జిల్లాలోనే మరో 6లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చేవారని షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కిరణ్‌ సర్కార్ అటకెక్కించిందని.. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది..ఇక పక్కా ఇళ్లకు ఏకంగా పాడి కట్టేశారని షర్మిల ధ్వజమెత్తారు. కిరణ్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంపునకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడని షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌కు ప్రజల్లోని విశ్వసనీయత జగనన్నకు కూడా ఉందని ప్రజల నమ్మకమని షర్మిల అన్నారు. 

YS జగన్ బెయిల్ పై పెరుగుతున్న ఆశలు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఆయన అభిమానులకు ఆశలు పెరుగుతున్నాయి.ప్రత్యేకించి బొగ్గు కుంభకోణం, ఇతర కేసులలో సిబిఐపై సుప్రింకోర్టు తీవ్రంగా మండిపడ్డ నేపధ్యంలో జగన్ కు బెయిల్ రావచ్చని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు.ఆయా కేసులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై సుప్రింకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.సిబిఐ పంజరంలో చిలకలా మారిందని వ్యాఖ్యానించడం సంచలనంగానే ఉంది.ఆయా కేసుల దర్యాప్తులలో అదికారులతో సంప్రదించవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చని తెలిపింది.ఇలాగ పరిస్థితి కొనసాగితే.సిబిఐ ప్రతిపత్తి విషయంలో కోర్టు చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా సుప్రింకోర్టు కూడా హెచ్చరించింది.న్యాయశాఖ మంత్రి సలహా మేరకే ఆయన వద్ద సమావేశం నిర్వహించామని సిబిఐ తెలిపింది.జగన్ కేసులో కూడా పిబిఐ రాజకీయ ప్రేరితంగా చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.జగన్ తరపు న్యాయవాదులు దీనిపై వాదించారు. సరిగ్గా సుప్రింకోర్టు కూడా సిబిఐని మందలించిన తరువాత ఒకటి,రెండు రోజులలో జగన్ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉంది.అందువల్ల వారు జగన్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు.