
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి , పాదయాత్రికురాలు షర్మిల ఒక సాంకేతిక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఓ వ్యక్తిని దోషీ అని చెప్పకుండా జైల్లో ఎలా పెడతారని, జగన్ నిర్దోషి అని తేలితే జైలు జీవితాన్ని వెనక్కి ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్-టిడిపి కలిసి జగనన్నను జైలుపాలు చేశారని, సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై కుట్రలు పన్నుతున్నారని, కుంటిసాకులతో జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల ఆరోపించారు. ఛార్జీషీట్లో పేర్లున్న మంత్రులను...