Sunday, 12 May 2013

వై.ఎస్ జగన్ నిర్దోషి అని తేలితే... షర్మిల ప్రశ్న

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి , పాదయాత్రికురాలు షర్మిల ఒక సాంకేతిక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఓ వ్యక్తిని దోషీ అని చెప్పకుండా జైల్లో ఎలా పెడతారని, జగన్ నిర్దోషి అని తేలితే జైలు జీవితాన్ని వెనక్కి ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్-టిడిపి కలిసి జగనన్నను జైలుపాలు చేశారని, సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై కుట్రలు పన్నుతున్నారని, కుంటిసాకులతో జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల ఆరోపించారు. ఛార్జీషీట్‌లో పేర్లున్న మంత్రులను...

జగన్.. జైల్లో కాదు జనం గుండెల్లో ఉన్నారు : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో లేరని జనం గుండెల్లో ఉన్నారని టీడీపీ మాజీ నేత, ప్రస్తుత వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.  ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్రంలో ఆరోపణలున్న మంత్రులను ఎందుకు తొలగించలేదని నిలదీశారు. మంత్రులు రహస్యాలను బయటపెడతారనే భయం ప్రభుత్వానికి పట్టుకుందని, అందువల్లే వారిని తొలగించడం...

చంద్రబాబుపై ఉమ్మారెడ్డి వ్యాఖ్యలు

ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు చంద్రబాబు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన టిడిపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ వదిలినవారిని విమర్శించడం మాని, బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. విచారణ గడువు పొడిగించాలని న్యాయవాది అశోక్‌భాను చెప్పడం సీబీఐ ఆంతర్యమా? సోనియా ఆంతర్యమా అని ఆయన ప్రశ్నించారు. జైలులో ఉన్నా జనం గుండెల్లో వైఎస్...

వై.ఎస్ జగన్ పార్టీకి కొత్త ఊపిరి ఇచ్చేది వీరే!

కాంగ్రెస్ నేతలు ఒక్కోసారి ఒక్కో వ్యాఖ్య చేస్తుంటారు.దానితో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అదినేతకు వాదనకు మంచి పాయింటు దొరుకుతుంటుంది.అసలే జగన్ పై రాజకీయ కేసు పెట్టారని విమర్శలు వస్తుంటే, గత ఉప ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి అజాద్ వాటిని నిజం చేస్తున్నట్లుగా జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారని అన్నారు. ఈ మధ్య మరో మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ లో కలిసేవరకు బెయిల్ రాదని వ్యాఖ్యానించారు. తాజాగా...

ఇది కోర్టు ధిక్కారం కాదా?

    ఎవరిని కరవమంటే వారిని కరుస్తుంది * సీబీఐ, ఈడీలపై నిప్పులు చెరిగిన షర్మిల *కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందుకే జగన్‌పై అబద్ధపు కేసులు * కేంద్రం పంజరంలో తాము చిలుకలమని సీబీఐ డెరైక్టరే అంగీకరించారు * ఆ చిలుక పలుకులు విని సుప్రీంకోర్టు జగన్‌కు బెయిల్ నిరాకరించడం దురదృష్టకరం * బొగ్గు స్కామ్‌పై సీబీఐ నివేదికను న్యాయశాఖ, పీఎంవోల్లోని వారు ఇష్టానుసారం మార్చారు *అయినా అక్కడ అరెస్టులు చేయరు.. జగన్ ఎవరినీ ప్రభావితం చేయకున్నా అరెస్టు చేశారు *సాక్షులను...

ఆ మంత్రుల్ని తక్షణమే తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్: కేంద్రమంత్రులు బన్సల్, అశ్వనీకుమార్‌లను తొలగించినట్టే.. సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకున్న రాష్ట్ర మంత్రులందరితోనూ రాజీనామా చేయించాలని బీజేపీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మంత్రులపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసినా, కోర్టులు అనుమానాలు వ్యక్తంచేసినా ఇంకా వారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఏ నైతిక ప్రమాణాలకు నిదర్శనమో చెప్పాలని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు కాంగ్రెస్‌ను నిలదీశారు.&nbs...

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 147వ రోజు సోమవారం 13.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చింతలపూడి మండలం రాఘవాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సమ్మిరివారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు.  పర్యటించే ప్రాంతాలు రాఘవాపురం, డీఎన్ రావుపేట, పోతునూరు, మల్లయ్యగూడెం, ఆముదాలచలక, సమ్మ...

3న నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరిక?

హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే నెల 3న కాషాయతీర్థం తీసుకునే అవకాశముంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరితో నాగం చర్చలు జరిపారని, బీజేపీలో చేరాల్సిందిగా సూచించారని తెలిసింది.&nbs...

నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడి శ్రీకంఠీరవ స్టేడియంలో గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్, తదితర ప్రాంతాల నుంచి 50 వేల మంది హాజరవుతారని అంచనా. కార్యక్రమంలో సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్.. బీజేపీపై విజయం సాధించడం, ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడం తెలిసిందే. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆరేళ్ల కిందట జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చే రారు. కాంగ్రెస్-జేడీఎస్...

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీబీఐ: గట్టు రామచంద్రరావు

వరంగల్: సీబీఐ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. వైఎస్ జగన్ విషయంలో ఒకలాగ, బొగ్గు కుంభకోణంలో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నిజాయితీగా విచారణ చేపట్టాల్సిన సీబీఐ.. ద్వంద ప్రమాణాలను పాటిస్తోందని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశార...

విప్ ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై రేపు విచారణ

హైదరాబాద్: శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై రేపు, ఎల్లుండి విచారిస్తారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఎదుట ఎమ్మెల్యేలు విడివిడిగా హాజరై వివరణ ఇస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ ప్రక్రియ జరుగుతుంది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది రేపు వివరణ ఇస్తారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది ఎల్లుండి వివరణ ఇస్తార...

YS జగన్ బయటకు రాకుండా కుట్ర: కొణతాల

హైదరాబాద్: పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాలతో మేరకే సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను బయపెట్టడానికి సీబీఐని వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వైఎస్‌ జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.&nbs...

సోనియాగాంధీపై కూడా లక్ష కోట్ల ఆరోపణ

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన లక్ష కోట్ల ఆరోపణలు చేశారో, ఇప్పుడు దేశంలో మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా అదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీపై ఈ ఆరోపణ చేశారు. సోనియా గాంధీకి విదేశాల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బు దాచారని ఆయన అభియోగం మోపారు. ఆ వివరాలు త్వరలోనే బయటపెడతానని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రధాని మన్మోహన్ మాత్రం సైలెంట్‌లో ఉన్న ఫోన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన...

టిడిపిది భావదారిద్ర్యం

తెలుగుదేశం పార్టీ బావదారిద్ర్యంలో ఉందని పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేయడం కాకుండా, దమ్ముంటే టిడిపి నేతలు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని సూచించారు.తనను రాజకీయ వ్యభిచారి అనడాన్ని,తాను దళితుడుని కానని టిడిపి నేతలు మోత్కుపల్లి , ఇతర నేతలు ప్రచారం చేయడం మానుకోవాలని,టిడిపికి ఏమి చెప్పాలో తెలియక ఇలాంటి బావదారిద్ర్యపు మాటలు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించార...