Friday, 10 May 2013

కడియం శ్రీహరి కోవర్టు: మోత్కుపల్లి

హైదరాబాద్ : కడియం శ్రీహరి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీలో కడియం ఓ కోవర్టుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. కడియం మానసికంగా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరిపోయారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి రాజీనామాతో పార్టీకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నార...

టీడీపీ విశ్వసనీయత కోల్పోయింది: కడియం శ్రీహరి

వరంగల్ : అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవటంతో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని కడియం శ్రీహరి అన్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసిపోయాయనే సంకేతాలు ప్రజలకు వెళ్లాయన్నారు. తనకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కడియం శ్రీహరి తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలో ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. ...

మెగాస్టార్ చిరంజీవి ఇంటి స్థలం పైల్ స్వాధీనం

గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి , మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కిరణ్ శిబిరానికి ఆగ్రహం తెప్పించాయా?తమ సత్తా ఏమిటో చూపించాలని అనుకున్నారా?ఆకస్మికంగా చిరంజీవికి సంబంధించిన ఇంటి స్థలం పైలును, బ్లడ్ బ్లాంక్ స్థలం ఫైలును సిఐడి అదికారులు స్వాదీనం చేసుకున్న వైనం రాజకీయ వర్గాలలో చర్చనీయంగా మారింది.ఒకపక్క చిరంజీవి కి అదిష్టానం వద్ద పరపతి పెరుగుతున్నది తెలిసి కూడా సి.ఎమ్.క్యాంప్...

టిడిపికి కడియం శ్రీహరి షాక్

తెలుగుదేశం సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం కు షాకిచ్చారు.గత కొద్దిరోజులుగా ఆయన పై ప్రచారం జరుగుతున్నప్పట్టికీ ఆయన ఖండిస్తూ వస్తున్నారు.తెలంగాణ వాదిగా గుర్తింపు పొందిన శ్రీహరి 1994,99లలోను వరంగల్ జిల్లా స్ఏషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో ను, అలాగే చంద్రబాబు క్యాబినెట్ లోను 1994-2004 వరకు మంత్రిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అఖిల పక్ష సమావేశానికి కూడా ఆయన టిడిపి ప్రతినిధిగా హాజరై సమర్దంగా...

కొండా దంపతులకు బీజేపీ గాలం !

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీని బలపరుచుకునే ప్రయత్నాలలో బీజేపీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తోంది. జగన్ పార్టీకి అండదండగా ఉన్న కొండా సురేఖ దంపతులను బీజేపీలోకి తెచ్చేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేరుగా కొండా దంపతులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో పార్టీ పగ్గాలన్నీ తమ చేతుల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల అధిష్టానం నిర్ణయాలకు నిరసనగా...

YS జగన్‌కి కాదు...జనానికి ఈ నిర్బంధం

అంతా అనుకున్నట్లే జరిగింది. జగన్‌కి బెయిల్ రాలేదు. మరో నాలుగు నెలల తరవాతే బెయిల్‌కి అప్పీల్ చేసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం. గడువు లోపల సీబీఐ తన విచారణ పూర్తి చెయ్యకపోతే, అప్పుడు జగన్ అవసరమైతే మళ్లీ పిటిషన్ పెట్టుకోవచ్చట. ఒకవేళ అలా పెట్టుకోకుండా సీబీఐ ఎన్ని సంవత్సరాలు విచారణ జరపాలనుకున్నా అంతకాలం జగన్ జైల్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గాను తన శక్తియుక్తులన్నిటినీ ధారబోసిన సీబీఐ న్యాయవాది బయటకు రాగానే ‘‘అవసరమైతే నాలుగునెలల...

రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..

సర్కారుపై షర్మిల ధ్వజం ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులు మానేస్తున్నారు వైఎస్ తెచ్చిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది పేదల కోసం పెట్టిన ఫీజుల పథకానికీ కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోంది రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి.. ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద...

YS జగన్ బెయిల్ తీర్పులో కొన్ని సందేహాలు

జగన్ కేసులో సుప్రింకోర్టు నిర్దేశించిన నాలుగు నెలల గడువు కు కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదా?సిబిఐ న్యాయ వాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఈ అనుమానాలకు తావిస్తాయి. నాలుగు నెలల్లో పూర్తి కావాలని అనేముంది. ఆరు నెలలు పట్టవచ్చు. అవసరమైతే మరో పిటిషన్ వేస్తామని భాన్ చెప్పిన తీరు విమర్శలకు గురి అవుతోంది. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. సిబిఐ న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్ అదికార ప్రతినిధిలా అశోక్ భాన్ మాట్లాడారని ఆ పార్టీ నేతలు...

ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రాజకీయవ్యవహారాల కమిటీ సమావేశమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఓదార్పుయాత్రపై కూడా చర్చించారు. ప్రజల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను విజయమ్మ సందర్శిస్తారని చెప్పారు.&nbs...

Telangana area YSRCP plan to start Odarpu Yatra

...

అసలు ఆయనొక ఎంపీ అన్న సంగతి ఎవరికీ గుర్తున్నట్టులేదు!!

భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిలో ఓటు హక్కు, విద్యా హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కు... ఇలా కొన్ని హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించింది. ఈ హక్కులకు అడ్డు తగులుతూ, కక్ష సాధింపు ధోరణితో వ్యక్తిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అయితే జగన్ విషయంలో కాంగ్రెస్‌పార్టీ సీబీఐతో కుమ్మక్కై ఆయన ప్రాథమిక హక్కుకే భంగం కలిగేలా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది! ఇది రాజ్యాంగ ఉల్లంఘన...

జానా రెడ్డి, డీఎస్ లకు చుక్కెదురు!

దర్పల్లి: కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్ లకు చుక్కెదురైంది. నిజమాబాద్ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో అధికారులు ఎందుకు పాల్గొన్నారని టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వెంకటేశ్వరగౌడ్‌, నర్సాగౌడ్, లు నిలదీశారు. నిజామాబాద్‌ జిల్లాలో దర్పల్లి మండలం లోలం గ్రామంలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. దాంతో అక్కడినుంచి అధికారులు వెనుదిరిగి వెళ్లార...

13న సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య పేరును ఎకె ఆంథోని అధికారికంగా ప్రకటించారు. అధిష్టానం ప్రతినిధులు ఆంటోనీ, అంబికా సోనీ ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సిద్ధ రామయ్య పేరును ఆంథోని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహిస్తార...

టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి రాంబాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు' వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబు పేరు రాయవలసిన చోట ఈనాడులో అప్పటి ముఖ్యమంత్రి అని రాశారని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా భూమి కట్టబెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ఎకరం దాదాపు 4 కోట్ల రూపాయలు ధర ఉన్న సమయంలో కేవలం 29 లక్షల రూపాయలకే ఇచ్చారని...

కుట్ర వల్లే YS జగన్ కు బెయిల్ రాలేదు: బాలినేని

ఒంగోలు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ కుట్ర వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత వైఖరి మరోసారి రుజువైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పటికీ కాంగ్రెస్ కు లొంగడని... ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండలని బాలినేని సూచించారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన తెలిపారు. మంత్రుల విషయంలో ఓ విధంగా... జగన్ విషయంలో మరోలా సీబీఐ వ్యవహరించిందని బాలినేని అన్నారు. 2జీ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా సీబీఐ కాంగ్రెస్ డైరెక్షన్ లో నడుచుకుందని ఆయన ఆరోపించారు....

YS షర్మిలను కలిసిన జలగం వెంకట్రావు

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న షర్మిలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలుసుకున్నారు. సత్తుపల్లి మండలం మందాలపాడులో ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చార...

YS జగన్ వెంటే ఉంటా: చెరుకుపల్లి

వరంగల్ : రాజీనామా వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఎప్పటికీ వైస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నార...