Monday, 20 May 2013

గోతిలో కాంగ్రెస్ నేతలే పడ్డారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ తీసిన గోతిలో కాంగ్రెస్ వారే పడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఎక్కువకాలం జైలులో ఉంచే కుట్రతోనే ఇప్పుడు దర్మాన, సబితలతో రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు.జగన్‌పై కుట్రలు బయటపెడితే జైలుకు పంపుతామని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని రాంబాబు తెలిపారు. ధర్మాన,...

దిగివస్తున్న బంగారం ధరలు

ముంబయి : నిన్న మొన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. బంగారం ధర 23,500 రూపాయలకు వస్తుందని నిన్న పలువురు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. గతరాత్రి 10 గ్రాముల ధర బాగా కోలుకుంది. ఎంసీక్స్ లో నిన్న ఒక దశలో 24 క్యారెట్ల ధర 25,400 రూపాయలకు వచ్చింది. అలాంటిది రాత్రి ట్రేడింగ్ ముగిసే సమాయానికి ధర 350 రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా.. మరో 237 రూపాయలు పెరిగి 26 వేల 72 రూపాయల వద్ద ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ ధర కనిష్ఠ స్థాయి 40 డాలర్లకు పైగా పెరగడంతో మన మార్కెట్లో పసిడి ధర కనిష్ఠ స్థాయి 600 రూపాయలకు...

షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 155వ రోజు మంగళవారం 11.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని వెల్లమిల్లిలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ముదునూరుపాడు చేరుతుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో సభ జరుగుతుందన్నారు.  పర్యటించే ప్రాంతాలు : వెల్లమిల్లి, పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెంలోని...

నేడు ‘ప్రాణహిత’కు YSవిజయమ్మ

- ప్రాణహిత-చేవెళ్ల సత్వర సాధన కార్యాచరణలో భాగంగా పర్యటన - ప్రాజెక్టు శిలాఫలకానికి పాలాభిషేకం - అనంతరం కాగజ్‌నగర్‌లో బహిరంగ సభ హైదరాబాద్: తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేసిన ప్రదేశాన్ని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం సందర్శించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు సత్వర సాధన కార్యాచరణలో భాగంగా...

ధర్మాన,సబిత ల రాజీనామాల పెండింగ్

మంత్రి దర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా పత్రాలను పెండింగులో ఉంచారు.మరో నాలుగు నెలల గడువు ఇవ్వాలని, అప్పటికీ కోర్టులో తమకు అనుకూలంగా రాకపోతే రాజీనామాలను ఆమోదించవచ్చని దర్మాన ప్రసాదరావు ప్రతిపాదించారు.ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కిరణ్ ఈ విషయాలను పేర్కొంటూ సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కు నివేదిక పంపారని కదనం.అయినా ఈ దశలో ఆమోదించకుండా ఉంటారా అన్నది చర్చనీయాంశం. ఈ రోజు ధర్మాన పుట్టిన రోజు కనుక ఇవ్వాళకు...

అది వైఎస్ ఒక్కరి నిర్ణయం కాదు:ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్: భూ కేటాయింపులు ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదని రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొనేవారందరూ దోషులుకాదని ఆయన అన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. '' పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేపని నేను ఏనాడూ చేయలేదు. వాన్ పిక్ కు భూమి ఇవ్వాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదు. భూమి ఎవరికివ్వాలన్నది...

రాజీనామాలు ఇచ్చిన ధర్మాన, సబిత

హైదరాబాద్: తమ రాజీనామాలపై కొనసాగుతున్న హైడ్రామాకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తెర దించారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఇరువురు మంత్రులు సీఎంను కలిసి రాజీనామా లేఖలు ఇచ్చారు. ...

వికలాంగులను మోసం చేసిన చిరంజీవి

హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వికలాంగులను మోసం చేశారని వికలాంగుల హక్కుల వేదిక ఆరోపించింది. ఒక వికలాంగుడి చేత పార్టీ జెండా ఆవిష్కరించుకున్న చిరంజీవి వారి సంక్షేమానికి ఏమీ చేయలేదని పేర్కొంది. అటువంటి చిరంజీవిని బర్తరఫ్ చేయాలని వేదిక డిమాండ్ చేసింది.&nbs...

ఇంకా ప్రధాని మౌనంగానే ఉంటారా! YSభారతి ప్రశ్న

ప్రధాని మన్మోహస్ సింగ్ కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్.భార్య రాసిన లేఖ ఆసక్తికరంగా ఉంది.తొలుత ఏబై రెండో ప్రతివాదిగా ఉన్న జగన్ ను ఒకటో నిందితుడు గా చేశారని, అలాగే మొదట మూడు నెలల సమయం కావాలన్న సిబిఐ, ఆ తర్వాత ఎనిమిదినెలల తర్వాత కూడా మరో నాలుగు నెలలగడువు కావాలని కోరడం నుంచి సిబిఐ న్యాయవాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రదాని దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రధాని మౌనంగా ఉండడం కాకుండా సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు.జగన్...

నరేంద్ర మోడీ పై పవార్ విమర్శలు

థానే: విద్యార్థిని ఇష్రత్ జహాన్ హత్య కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై ఎన్పీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. అమాయక జహాన్ పై తీవ్రవాది ముద్ర వేసి ఆమెను గుజరాత్ పోలీసులు చంపేశాయని ఆరోపించారు. తమ పోలీసులేదో ఘనత సాధించినట్టు మోదీ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నారని పవార్ అన్నార...

కాంగ్రెస్ లోనే ఉంటా-సబిత ఇంద్రారెడ్డి

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.తనను కలిసిన వారితో ఆమె మాట్లాడుతూ తాము బిజినెస్ రూల్స్ ప్రకారమే పనిచేశామని, తన పై వచ్చిన కేసులో న్యాయపరంగా పోరాటం చేస్తానని ఆమె చెబుతున్నారు.జీవితంలో ఎన్నో పోరాటాలు చూశామని,అందువల్ల కార్యకర్తలంతా దైర్యంగా ఉండాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి తాను కృషి చేస్తానని,మంత్రిగాఉన్నప్పట్టికీ, కార్యకర్తగానే పనిచేశానని ఆమె అన్నార...

సబితను బలిచేయటం తగదు: దానం నాగేందర్

హైదరాబాద్ : మంత్రివర్గం సమష్టి నిర్ణయాలకు సబితా ఇంద్రారెడ్డిని బలి చేయడం తగదని కార్మిక శాఖ మంత్రి మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన సబితకు సంఘాభావం ప్రకటించారు. సంతకం పెట్టడమే తప్పయితే 26 జీవోలు జారీ చేసిన మంత్రుల అందరితోనూ రాజీనామాలు చేయించాల్సి వస్తుందని దానం అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవాలంటే సబిత నాయకత్వం అవసరమన్నారు.&nbs...

ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: సబిత ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవిలో ఉన్నంతకాలం నిబంధనలకు అనుకూలంగానే జీవోలు ఇచ్చినట్లు ఆమె సోమవారమిక్కడ తెలిపారు. తాను 20 రోజుల క్రితమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిన్న తాను ఎలాంటి రాజీనామా లేఖ ఇవ్వలేదని సబిత వెల్లడించారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  కాగా సబిత నివాసం వద్ద ఆమె మద్దతుదారులు...

కిరణ్‌, బొత్స మాట మార్చారు: తలసాని

హైదరాబాద్ : ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రులను సమర్థిస్తూ సీబీఐని తప్పుబట్టిన ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇప్పుడు మార్చారని ఆయన ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవినీతికి గేట్లు తెరిచారని తలసాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపైనే...

కాంగ్రెస్ రక్షకుడు చంద్రబాబే: కడియం శ్రీహరి

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వని బాబు ఇప్పుడు మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు.  కిరణ్ కుమార్ సర్కార్ ను కాపాడుతున్నదే చంద్రబాబు అని, టీడీపీ మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోందని కడియం అన్నారు....

బలి పశువు అయ్యాను: ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్ : మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఉదయం ధర్మానను కలిశారు. తాను బలిపశువునయినట్లు ధర్మాన ఈ సందర్బంగా వారి వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా ఈరోజు సాయంత్రం 6.30గంటలకు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వెళ్లనున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ధర్మాన భవిష్యత్‌ కార్యాచరణను తేల్చుకోనున్నట్టు సమాచారం. అయితే ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై...

YS జగన్మోహన్ రెడ్డి కేసులో ఉద్దేశపూర్వక తాత్సారం

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైయస్ భారతి ఆదివారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె ఆ లేఖలో విజ్ఙప్తి చేశారు. సీబీఐ దర్యాప్తు నిబంధనల ప్రకారం సాగటం లేదని ఆ లేఖలో ఆరోపించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడమే సీబీఐ లక్ష్యంగా పెట్టుకోవడమే...