హైదరాబాద్ : పదవ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి పరీక్షా ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈసారి కూడా గతేడాది తరహాలోనే మార్కులు వెల్లడించకుండా కేవలం గ్రేడ్లను మాత్రమే ప్రకటించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే అధికశాతం ఉత్తీర్ణత సాధించారు. 88.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 0.24 ఉత్తీర్ణత శాతం పెరిగింది.
విద్యార్థులు ఏపీ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల నుంచి తమ గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ల సగటు (జీపీఏ) పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ లాండ్లైన్, మొబైల్ ద్వారా...