
ఢిల్లీ లో అధిష్టానం పెద్దల వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే పైచేయి అయినట్లు కనిపిస్తుంది.జగన్ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులపై చర్య తీసుకోవాలా?వద్దా అన్నదానిపై అదిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ముఖ్యమంత్రి కిరణ్ ఈ మంత్రుల తరపున గట్టిగా వాదించారని చెబుతున్నారు.దానితో ఆ విషయంపై నిర్ణయాన్ని ఆయనకే వదలిపెట్టినట్లు కధనాలు వస్తున్నాయి.దర్మాన, సబిత తదితరులపై కేవలం ఆరోపణలే వచ్చాయని, అవి నిర్దారణ కాకుండా చర్య తీసుకోరాదన్నది ముఖ్యమంత్రి అబిమతంగా...