Friday, 10 May 2013

YS జగన్ బెయిల్ తీర్పులో కొన్ని సందేహాలు

జగన్ కేసులో సుప్రింకోర్టు నిర్దేశించిన నాలుగు నెలల గడువు కు కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదా?సిబిఐ న్యాయ వాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే ఈ అనుమానాలకు తావిస్తాయి. నాలుగు నెలల్లో పూర్తి కావాలని అనేముంది. ఆరు నెలలు పట్టవచ్చు. అవసరమైతే మరో పిటిషన్ వేస్తామని భాన్ చెప్పిన తీరు విమర్శలకు గురి అవుతోంది. దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. సిబిఐ న్యాయవాదిగా కాకుండా కాంగ్రెస్ అదికార ప్రతినిధిలా అశోక్ భాన్ మాట్లాడారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.తమ అదికారులు విదేశాలలో ఉన్నారని, సమాచారం వారికి అందుబాటులోకి రాకపోతే,మరింత గడువు కోరతామని ఆయన అన్నారు. 

                                          నిజానికి గతంలోనే సుప్రింకోర్టు జగన్ కేసులో సాధ్యమైనంత త్వరంగా పూర్తి చేయాలని కోరింది.మార్చి ముప్పై ఒకటి తేదీ గడువు పెట్టాలని కోర్టు భావిస్తే, జగన్ తరపు న్యాయవాదులు అది సుదీర్ఘకాలం అవుతుందని భావించి, దానికి అభ్యంతరం చెప్పారు.దాంతో ఆ గడువు ప్రస్తావన తీర్పులో లేదు.సాధ్యమైనంత త్వరగా అని మాత్రం పేర్కొన్నారు.విశేషం ఏమిటంటే అప్పటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఇప్పటి న్యాయమూర్తులు పట్టించుకున్నట్లు కనబడదు. సిబిఐ కోరిన విదంగా మరో నాలుగు నెలల గడువు ఇవ్వడం ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగానే సిబిఐ చేసిన వాదన ప్రకారం సుప్రింకోర్టుకు కూడా ఈ కేసులో ఆధారాలు కనిపించాయా?లేక సిబిఐకి ఇలాంటి విషయాలలో స్వేచ్చ ఇవ్వాలని భావించారా అన్న విషయం తెలియదు. అదే సమయంలో ఈ కేసులో అదికారంలో ఉన్న మంత్రులు కొందరికి ఇప్పటికే బెయిల్ ఇవ్వడమో, అరెస్టు చేయకుండా ఉండడమో జరిగింది.దాని గురించి సుప్రింకోర్టు ఎందుకు ప్రశ్నించదో అర్ధం కాదు. దీంతో సుప్రింకోర్టు తీర్పును విమర్శించే అవకాశాలు వచ్చాయి. అలాగే అశోక్ భాన్ హడావుడిగా ఒక ప్రత్యర్ధి న్యాయవాది గా మాట్లాడారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రచారం చేయడానికి అవకాశం కల్పించారు.ఒక కేసులో దర్యాప్తు సంస్థలు ఎంత కాలమైనా దర్యాప్తు చేసుకుంటూ పోవచ్చా?కొందరు నిందితులను వదలి, కొందరినే నిర్భందించడం వంటి వాటి ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగడం లేదేమో అన్న భావన కలగడానికి ఆస్కారం కలిగించడం లేదా?ఇలాంటి ప్రశ్నలకు ఈ కేసులో సమాధానం రావడం లేదు.దాంతో ఇది రాజకీయ ప్రేరిత కేసుగానే జనం భావించే పరిస్థితి రావడం మాత్రం దురదృష్టకరం.

ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రాజకీయవ్యవహారాల కమిటీ సమావేశమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఓదార్పుయాత్రపై కూడా చర్చించారు. ప్రజల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను విజయమ్మ సందర్శిస్తారని చెప్పారు. 

Telangana area YSRCP plan to start Odarpu Yatra

అసలు ఆయనొక ఎంపీ అన్న సంగతి ఎవరికీ గుర్తున్నట్టులేదు!!


భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిలో ఓటు హక్కు, విద్యా హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కు... ఇలా కొన్ని హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించింది. ఈ హక్కులకు అడ్డు తగులుతూ, కక్ష సాధింపు ధోరణితో వ్యక్తిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అయితే జగన్ విషయంలో కాంగ్రెస్‌పార్టీ సీబీఐతో కుమ్మక్కై ఆయన ప్రాథమిక హక్కుకే భంగం కలిగేలా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది! ఇది రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.

రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువనేత జగన్‌ను ఎదుర్కోవటానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో! నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగి, రాజకీయాల్లో తలపండిన అతిరథ మహారథులు ఉన్న కాంగ్రెస్ పార్టీ; ముప్పై యేళ్ల రాజకీయానుభవం, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ... కడప లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం గుర్తొచ్చి, గుండెల్లో దడపుట్టి, జగన్‌కు ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందోనన్న భయంతో... ఈర్ష్య, కక్ష సాధింపులతో ఆయన్ని జైల్లో నిర్బంధించటం ఎంతవరకు న్యాయం?

కాంగ్రెస్, టీడీపీలకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలే కనుక వారిని కోరుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలి కాని, అనవసరమైన వ్యర్థ ఆరోపణలతో, కుంటి సాకులతో జగన్‌ను జైల్లో నిర్బంధించటం ప్రాథమిక హక్కులను కాలరాయడమే! కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను ఇలా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే, అంతకంతా వంద రెట్లు జగన్‌కు ప్రజాభిమానం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తరగదు. న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంటారు. న్యాయమూర్తులైనా జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వొచ్చు కదా. జగన్ ఏమైనా దేశం విడిచి పారిపోతాడా? అసలు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడన్న విషయం వీళ్లెవరికైనా గుర్తుందా? 

జగన్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారోనని కాంగ్రెస్, తెలుగుదేశం, ఎల్లో మీడియాల భయం. అయినా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవటం తప్పు కాదే! ఆయనకు ఆ హక్కు లేదా? ప్రజా సంక్షేమానికి పాటుపడగల సామర్థ్యం ఉంది. ప్రజాదరణ ఉంది. అది తెలుసుకోకుండా ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందాన కాంగ్రెస్, టీడీపీలు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ తందాన అంటే సీబీఐ తాన తందాన అనటం బాగా అలవాటైపోయింది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను నిర్బంధించటం శోచనీయం. ఇదేనా మనం భావితరాలకు ఇచ్చే రాజకీయ సందేశం, ఉపదేశం!

- చింతపల్లి సత్యనారాయణ ప్రసాద్, భవానిపురం, విజయవాడ

జగన్ బయట ఉండి వుంటే వీళ్లు ఇన్నేసి మాటలు అనేవారా?!

ఒక వ్యక్తి బాణం వదిలితే, ఎదుటి వ్యక్తి మనోధైర్యం గలవాడైతే, ఆ బాణం వారిని తాకదు. తిరిగి ప్రయోగించిన వ్యక్తికే వచ్చి గుచ్చుకుంటుంది. జగన్‌పై మాటల బాణాలు సంధించినవారికి కూడా ఇదే పరిస్థితి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని రాజశేఖరరెడ్డిగారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒక మాట మాట్లాడితే దానిలో నిబద్ధత ఉండాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే అది మాట్లాడినవారికే అనర్థం అనేవారు. ఎదుటివారికి బాధ కలిగించే ఏ మాటలైనా క్షమించరానివి. 

అసలు జగన్ ఏం తప్పు చేశారని అందరూ ఇన్ని మాటలంటున్నారు? జగన్ ఆస్తులను అక్రమాస్తులు అనడమే తప్పు. వ్యాపారం సజావుగా సాగాలంటే పెట్టుబడులు రాబట్టాలి కదా. ఆ విధంగా వచ్చిన పెట్టుబడులన్నీ అక్రమాస్తులు అనడం సమంజసమేనా? సీబీఐ ఇంకా జగన్ ఆస్తుల విషయంలో ఒక నిర్థారణకు రాలేదు. నేటికీ అభియోగాలు మాత్రమే దాఖలు చేస్తోంది. అలాంటప్పుడు ‘అక్రమం’ అనే మాట ఎలా ఉపయోగిస్తారు. ‘జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆ డబ్బుతో ఒక రాష్ట్రాన్నే కొనెయ్యగలడు’ అని కొందరు నాయకులంటున్నారు. ఒక నాయకుడైతే మరికాస్త ముందుకెళ్లి ‘జగన్‌కు పద్నాలుగేళ్లు జైలుశిక్ష వేయాలి’ అన్నాడు. 

ఇంకొకాయన ‘ఉరిశిక్ష’ వేయించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏం మాటలండీ ఇవి? ఒకసారి ఆ వ్యక్తులు తమ బిడ్డలమీద ప్రమాణం చేసి చెప్పమనండి... జగన్ దోషి అని. రాజకీయ కక్షతో జగన్‌ని అణగదొక్కటానికి ఆయనపై అనేక రకాలుగా రాళ్లు వేస్తున్నారు. అవి ఎంతమాత్రం జగన్‌ను తాకవు. అసలు జగన్ జైల్లో కాకుండా, బయట ప్రజల్లో ఉండి ఉంటే, వీరు ఇన్ని మాటలు ధైర్యంగా అనగలిగేవారా? ఆ ధైర్యం వారికి ఉందా? గుండెల మీద చేతులేసుకుని చెప్పమనండి. ఏదైతేనేం. జగన్ మీద ఒక మబ్బు పొర కమ్ముకుని ఉంది. అది త్వరలో తొలగిపోయి, స్వచ్ఛమైన వ్యక్తిగా బయటకు వస్తారు. 

- టి.వి.సుబ్బారెడ్డి, కూకట్‌పల్లి, హైదరాబాద్

జానా రెడ్డి, డీఎస్ లకు చుక్కెదురు!

దర్పల్లి: కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్ లకు చుక్కెదురైంది. నిజమాబాద్ జిల్లాలో కార్యకర్తల సమావేశంలో అధికారులు ఎందుకు పాల్గొన్నారని టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వెంకటేశ్వరగౌడ్‌, నర్సాగౌడ్, లు నిలదీశారు. నిజామాబాద్‌ జిల్లాలో దర్పల్లి మండలం లోలం గ్రామంలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. దాంతో అక్కడినుంచి అధికారులు వెనుదిరిగి వెళ్లారు.

13న సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య పేరును ఎకె ఆంథోని అధికారికంగా ప్రకటించారు. అధిష్టానం ప్రతినిధులు ఆంటోనీ, అంబికా సోనీ ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సిద్ధ రామయ్య పేరును ఆంథోని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు.

టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి రాంబాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు' వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబు పేరు రాయవలసిన చోట ఈనాడులో అప్పటి ముఖ్యమంత్రి అని రాశారని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా భూమి కట్టబెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ఎకరం దాదాపు 4 కోట్ల రూపాయలు ధర ఉన్న సమయంలో కేవలం 29 లక్షల రూపాయలకే ఇచ్చారని వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడుపై సిబిఐ ఎందుకు విచారణ జరపడంలేదని ఆయన ప్రశ్నించారు. 

కుట్ర వల్లే YS జగన్ కు బెయిల్ రాలేదు: బాలినేని

ఒంగోలు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ కుట్ర వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీబీఐ పక్షపాత వైఖరి మరోసారి రుజువైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పటికీ కాంగ్రెస్ కు లొంగడని... ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండలని బాలినేని సూచించారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన తెలిపారు.

మంత్రుల విషయంలో ఓ విధంగా... జగన్ విషయంలో మరోలా సీబీఐ వ్యవహరించిందని బాలినేని అన్నారు. 2జీ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా సీబీఐ కాంగ్రెస్ డైరెక్షన్ లో నడుచుకుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏదో రాజకీయం నడిపారని ప్రజలు అనుకుంటున్నారని బాలినేని అన్నారు. 

YS షర్మిలను కలిసిన జలగం వెంకట్రావు

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న షర్మిలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలుసుకున్నారు. సత్తుపల్లి మండలం మందాలపాడులో ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.