Tuesday, 28 May 2013

దీక్ష ప్రారంభించిన వైఎస్ విజయమ్మ

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన దీక్షలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పాల్గొన్నారు. మహానేత వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. జగన్ సతీమణి వైఎస్‌ భారతి కూడా దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు దీక్షకు తరలి వచ్చారు. 

0 comments:

Post a Comment