హైదరాబాద్ : పార్టీ క్రమశిక్షణను తాను ఏనాడు ఉల్లంఘించలేదని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయన రఘునందనరావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తన సస్పెన్షన్ పై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవమని రఘునందనరావు మీడియా సమావేశంలో తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే తాను చేసిన ద్రోహమేంటో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
కేసీఆర్ ను అనుక్షణం కాపాడటమే తాను పార్టీకి చేసిన ద్రోహమా అని రఘునందనరావు ప్రశ్నించారు. పార్టీకి ఏ ద్రోహం చేశానో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.
గత అర్థరాత్రి ఏ స్థితిలో తనపై సస్పెన్షన్ వేటు పడిందో తెలుసునన్నారు. అవకాశవాదుల్ని పార్టీలోకి చేర్చుకోవద్దని చెప్పటమే తాను చేసిన తప్పా అని సూటిగా అడిగారు. తాను చంద్రబాబునాయుడును కలిసాననటం అవాస్తవం అన్నారు. ఈ సందర్భంగా రఘునందనరావు ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
0 comments:
Post a Comment