Thursday 16 May 2013

T.మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్!


కరీంనగర్‌: తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మండిపడ్డారు. సీఎంను చూస్తే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయని కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టి.మంత్రులు, కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం బూట్లు మోయడానికే పనికొస్తారు అని కేసీఆర్‌ అన్నారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమంటే నోరు మెదమని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మలు చవటలు అని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పూడికతో నిండిపోతుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు అని అన్నారు. తెలంగాణ వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు. 24గంటలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని కేసీఆర్‌ హమీ ఇచ్చారు.

0 comments:

Post a Comment